- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు సోమవారం నగరంలోని రెండవ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రెండవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాసిర్ అరాఫత్ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానిత ప్రదేశాలలో ప్రజలు రద్దీగా ఉండే ప్రదేశాలలో అనుమానం గల పాన్ షాప్ లలో హోటల్స్ దగ్గర డాగ్ స్క్వాడ్ తో చెకింగ్ చేశారు. రెండవ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నేరాలను అదుపు చేసేందుకు ప్రజలను అవేర్నెస్ చేసేందుకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని ఎస్ఐ తెలిపారు.
- Advertisement -