- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
జిల్లా 1962 ప్రాజెక్ట్ లో పారవేట్ గా విధులు నిర్వహించే జక్కిన రామకృష్ణ గత మార్చి నెలలో అనారోగ్య కారణాలు మరణించగా బుధవారం స్టేట్ హెడ్ బి కిరణ్ కిషోర్ చెక్కును అందజేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో భాగంగా కానీ ఏ అనారోగ్య కారణాలు వల్ల కానీ ఏ ఉద్యోగస్తుడైన ప్రాణాలు కోల్పోతే వారికి ఈ.ఎం.ఆర్.ఐ గ్రీన్ హెల్త్ సర్వీసెస్ సంస్థ నుండి బాధిత కుటుంబాలకు కంపెనీ నుంచి 5 లక్షల రూపాయలను ఇస్తుందని అన్నారు. ఈ అమౌంట్ ను ఉద్యోగస్తుల నామినీకి అందజేసినట్టు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -