- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో జరిగిన చేవెళ్ల రోడ్డుప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు గాంధీనగర్కు చెందిన ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కుమార్తెలు తనూష, సాయి ప్రియ, నందిని ఈ ప్రమాదంలో మృతిచెందారు. మరో యువతి అఖిలరెడ్డి కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలి పెళ్లి వేడుకలో సందడి చేసిన ఈ నలుగురు యువతులు చనిపోవడంతో రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



