Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ ప్రతి ఇంటికో ఛత్రపతి శివాజీ తయారుకావాలి: ఎమ్మెల్యే ధన్ పాల్

 ప్రతి ఇంటికో ఛత్రపతి శివాజీ తయారుకావాలి: ఎమ్మెల్యే ధన్ పాల్

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్:   హిందూ సామ్రాజ్య దినోత్సవం సందర్బంగా శ్రీ శివాజీ మహారాజ్ సేవ సమితి ఆధ్వర్యంలో బోర్గంలో ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ముఖ్యఅతిథులుగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ హాజరు కావడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ పట్టాభిషేక్తులైన రోజు, హిందూ సామ్రాజ్య దినోత్సవం రోజున బోర్గంలో శివాజీ విగ్రహ ఆవిష్కరణ జరుపుకోవడం శుభపరిణామం అన్నారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ..హిందూ ధర్మాన్ని సంరక్షిస్తూ హిందూ సమాజాన్ని చైతన్యం చేసిన హిందూ సామ్రాట్ ఛత్రపతి శివాజీ వీరత్వం కలిగిన యువత దేశానికి కావాలన్నారు. హిందూ సమాజంపైన జరుగుతున్న దాడులకు, హిందూ ఆడబిడ్డలను లవ్ జిహాద్ పేరిట జరుగుతున్నా అన్యాయాలను ప్రతిఘటించడానికి ప్రతి ఇంట్లో ఒకరు ఛత్రపతి శివాజీ తయారు కావాలన్నారు. ఛత్రపతి శివాజీని గొప్ప వీరునిల తీర్చిదిద్దిన తల్లి జిజీయా భాయ్ నేటి మహిళలకు ఆదర్శం అన్నారు. చిన్నప్పటినుండే పిల్లలకు ఉగ్గుపాలతో వీరత్వాన్ని నేర్పించాలని అన్నారు. గోవులను తల్లిగా భావించే హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీసే విదంగా గోవద జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టనట్టు వ్యవహరించడం పై మండిపడ్డారు. గోవదను హిందువులు అంత ఒక్కటై ఎదుర్కోవాలని విజ్ఞప్తి చేసారు. తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మందిరాలపై దాడులు రోజురోజుకి పెరుగుతున్న ప్రభుత్వం ఓ వర్గానికి కొమ్ముకాస్తుదని మండిపడ్డారు.

రాష్ట్రంలో హిందుదేవాలయాలపైన, హిందు ఆడబిడ్డలపైన దాడులు జరిగితే సాహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ శివాజీ మహారాజ్ సేవా సమితి ఇందూర్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు ముజే లక్ష్మణరావు కార్యదర్శి రవి, కోశాధికారి జగన్, ఉపాధ్యక్షులు దుర్గాప్రసాద్ & రాజేశ్వర్ మరియు కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -