29న తేల్చనున్న ఎఐఎఫ్ఎఫ్
న్యూఢిల్లీ : భారత ఫుట్బాల్ చీఫ్ కోచ్గా భారీ అంచనాల నడుమ బాధ్యతలు చేపట్టిన మనాలో మార్కెజ్ (స్పెయిన్) బ్లూ టైగర్స్ కోచ్గా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లోనూ విజయం సాధించలేదు. ఇటీవల ఆసియా కప్ క్వాలిఫయర్స్లో హాంగ్ కాంగ్ చేతిలో 0-1 ఓటమి, బంగ్లాదేశ్తో గోల్ లేని డ్రా అనంతరం చీఫ్ కోచ్పై వేటు వేయాలనే డిమాండ్ ఎక్కువైంది. పసలేని ప్రదర్శన, గోల్ లేని మ్యాచులతో అభిమానుల్లోనూ ఫుట్బాల్ జట్టు ఆదరణ కోల్పోతుంది. ఈ పరిస్థితుల్లో ఆల్ ఇండియా ఫుట్బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కళ్యాణ్ చౌబె కీలక నిర్ణయానికి సిద్ధవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 29న ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మనాలో భవితవ్యంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని చౌబె తెలిపారు. ‘మనాలో మంచి కోచ్. భారత ఫుట్బాల్పై మంచి అవగాహన ఉంది. కానీ కొన్ని రోజులుగా కోచ్ను తొలగించా లని నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఈ నెల 29న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మానాలోపై చర్చిస్తాం. గోల్ కొట్టకుండా విజయాలు ఆశించలేమని’ చౌబె తెలిపారు.
చీఫ్ కోచ్పై వేటు?
- Advertisement -
- Advertisement -