Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్పల్లిగింజ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

పల్లిగింజ గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి

నవతెలంగాణ – హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అబ్దుల్లాపూర్‌మెట్‌ లో పల్లిగింజ గొంతులో ఇరుక్కుని ప్రాణాలు కోల్పోయింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లష్కర్‌గూడ నివాసితులైన బండారి మహేశ్వరి, శ్యామ్‌సుందర్‌ దంపతుల ఏకైక కుమార్తె తన్విక (4). ఆ చిన్నారి ఆదివారం ఇంట్లో వేయించిన పల్లీలు తింటుండగా, ప్రమాదవశాత్తు ఓ పల్లిగింజ గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విషయాన్ని తన్విక తల్లిదండ్రులకు చెప్పింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, తన్వికను హుటాహుటిన హైదరాబాద్‌లోని నీలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు, గొంతులో పల్లిగింజ ఇరుక్కున్నట్లు నిర్ధారించారు. ఆస్పత్రిలో చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img