- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదిన సందర్భంగా శుక్రవారం అక్బర్ పేట భూంపల్లి మండలం చౌదర్ పల్లి అంగన్వాడీ కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ స్వరూప ఆధ్వర్యంలో ‘ బాలల దినోత్సవాన్ని’ ఘనంగా జరుపుకున్నారు. నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేసి స్మరించుకున్నారు. చిన్నారులకు స్వీట్లు, చాక్లెట్ లు పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రాసన, అక్షరాభ్యాసం చేయించారు. పంచాయతీ కార్యదర్శి దివ్య, అంగన్వాడీ టీచర్ విజయ, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



