విజయ్ హజారే మ్యాచ్ల వేదిక మార్పు
బెంగళూరు : ఐపీఎల్ ట్రోఫీ కోసం 18 వసంతాలు ఎదురుచూసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ అభిమానులు.. ఈ ఏడాది ఆ జట్టు చాంపియన్గా నిలువటంతో చేసుకున్న విజయ సంబురాలు తీవ్ర విషాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట ఘటన, స్వతంత్ర దర్యాప్తు ఇప్పుడు చారిత్రక స్టేడియంలో మ్యాచ్ల నిర్వహణకు ఆటంకంగా మారాయి. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో కోహ్లి ఆడగా.. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానం అభిమానులతో కిక్కిరిసింది. విజరు హజారే ట్రోఫీలో ఢిల్లీ మ్యాచ్లు బెంగళూర్లో షెడ్యూల్ చేశారు. కానీ భద్రత కారణాలతో ఆ మ్యాచ్లను బెంగళూర్లోని సీఓఈలో నిర్వహించనున్నారు. కర్ణాటక క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడు వెంకటేశ్ ప్రసాద్ చిన్నస్వామి స్టేడియంలో ప్రభుత్వ అధికారులతో వరుస సమావేశాలు నిర్వహించినా.. చిక్కులు తొలిగినట్టు కనిపించటం లేదు. సీఓఈలో మ్యాచ్లకు అభిమానులకు అనుమతించే అవకాశం లేదని సమాచారం.
తొలగని చిన్నస్వామి చిక్కులు?
- Advertisement -
- Advertisement -



