నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా చింతల యువసేన, వారి అభిమానుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్, రాయగిరిలోని సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో వృద్ధులకు మధ్యాహ్న భోజన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చింతల యువసేన నాయకులు మాట్లాడుతూ.. వెంకటేశ్వర రెడ్డి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శ్రీ యాదాద్రి లక్ష్మీనృసింహ స్వామి వారి ఆశీస్సులతో భవిష్యత్తులో వారు ఎన్నో అత్యున్నత పదవులు అధిరోహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వలపు విజయ్, దండబోయిన బలరాజ్ యాదవ్, గాజుల నవీన్, పల్లెపాటి రవికుమార్, ఎలిమినేటి మహేంద్ర రెడ్డి, దోషపాటి హరీష్, కూదే శ్రీశైలం, మోతే మనోహర్, నాగారం నరేష్, చింతల యువసేన నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.



