Tuesday, May 6, 2025
Homeజాతీయంరేప‌ట్నుంచి సివిల్ మాక్ డ్రిల్..కేంద్ర హోం శాఖ కార్యదర్శి కీల‌క ఆదేశాలు

రేప‌ట్నుంచి సివిల్ మాక్ డ్రిల్..కేంద్ర హోం శాఖ కార్యదర్శి కీల‌క ఆదేశాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-కామారెడ్డి: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌ ఆధ్వర్యంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉన్నాయి. కేటగిరి 2లో తెలుగు రాష్ట్రాల్లోని విశాఖపట్నం, హైదరాబాద్‌లు ఉన్నాయి. రేపు మొత్తం 259 చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కశ్మీర్‌, గుజరాత్‌, హిర్యాణా, అస్సాం, రాజస్థాన్‌, పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అత్యధిక చోట్ల డ్రిల్స్‌కు ఏర్పాట్లు చేశారు.శత్రుదాడి జరిగినప్పుడు స్వీయరక్షణతో పాటు విద్యార్థులు, యువకులు ఎలా ప్రతిస్పందించాలో అవగాహన కల్పించాలని హోంశాఖ తెలిపింది. కాగా సివిల్ మాక్‌డ్రిల్స్‌ నిర్వహణ కొత్తదేమీ కాదు. 1971లో బంగ్లాదేశ్‌ విముక్తి కోసమని భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ సమయంలో పౌరుల భద్రత కోసమని అప్పటి ప్రభుత్వం యుద్ధానికి ముందు సెక్యూరిటీ మాక్‌ డ్రిల్స్‌ను నిర్వహించింది. ఇప్పుడు 54 ఏండ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వం మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తున్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -