- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రజాపాలన 99 రోజుల ప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శనివారం మద్నూర్ మండలంలోని పెద్ద తడూగుర్ డోంగ్లి మండలంలోని మల్లాపూర్ గ్రామంలో ఆయా గ్రామ సర్పంచులు పాలకవర్గం సభ్యులు పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు అనుమవ్వ ఈరన్న, అమృత్వార్ శ్రీకాంత్, మాట్లాడుతూ తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రగతి కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు గ్రామాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉపసర్పంచులు పంచాయతీ వార్డు సభ్యులు పంచాయతీ కార్మికులు సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



