- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్ : పట్టణంలోని రాంనగర్ రామాలయంలో ఆదివారం మహాత్మ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించినారు. ఆలయ కమిటీ భక్తుల సహకారంతో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు తొలగించినారు. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ..ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో ఏడు వారాలుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గుద్దేటి రమేష్, గంగా మోహన్ చక్రు, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రశాంత్, సుంకే నిశాంత్, జీడి రాజకుమారూ, కుతాడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -