Tuesday, December 16, 2025
E-PAPER
Homeబీజినెస్క్లియర్‌ట్రిప్ అన్‌ప్యాక్డ్ 2025..భారతదేశంలో సమగ్ర వీక్షణం

క్లియర్‌ట్రిప్ అన్‌ప్యాక్డ్ 2025..భారతదేశంలో సమగ్ర వీక్షణం

- Advertisement -

నవతెలంగాణ – బెంగళూరు: ఫ్లిప్‌కార్ట్ సంస్థ కావటంతో పాటుగా భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆన్‌లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన క్లియర్‌ట్రిప్, ఈరోజు క్లియర్‌ట్రిప్ అన్‌ప్యాక్డ్ – ఏ రీక్యాప్ అఫ్ హౌ ఇండియా ఫ్లూ , స్టేయిడ్, అండ్ సెర్చ్డ్ ఫర్ చుట్టి ఇన్ 2025 (‘భారతదేశం ఎలా ప్రయాణించింది, బస చేసింది మరియు సెలవుల కోసం శోధించింది’) నివేదిక ను విడుదల చేసింది.  ఈ సంవత్సరం ప్రత్యేకత ‘జెన్ జి ప్రయాణికుల’లో బహుళ రెట్ల వృద్ధి, మరియు ‘విలువ & సరసమైన ధర’ ప్రధాన ఆఫర్‌గా నిలవడంతో పాటుగా లక్షలాది మంది భారతీయులకు నచ్చింది.

1. ఈ సంవత్సరం ప్రత్యేకత: సరసమైన ధర, విలువ మరియు జెన్ జి!

·      యుపిఐ చెల్లింపుల సౌలభ్యం మరియు బహుళ బ్యాంకులతో భాగస్వామ్యాల కారణంగా, యుపిఐ లావాదేవీలలో ~6% మరియు క్రెడిట్ కార్డ్ చెల్లింపులలో 8% పెరుగుదల కనిపించింది.

·      65% కంటే ఎక్కువ బుకింగ్‌లు క్లియర్‌ట్రిప్‌లో విస్తృత శ్రేణి బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ హోటళ్లకు జరిగాయి.

·      మొత్తం బుకింగ్‌లలో 65% క్లియర్‌ట్రిప్ మొబైల్ యాప్‌లో ఫోన్‌లోనే జరిగాయి.

·      2025లో జెన్ జి ప్రయాణికులు 650% పెరిగారు. వారు ఈ సంవత్సరం అనేక ప్రదేశాలలో సందడి చేశారు. అత్యంత ఆదరణ పొందినవి దుబాయ్, కౌలాలంపూర్ మరియు బ్యాంకాక్ – #GenZApproved! 

2. భారతదేశం ఎలా ప్రయాణించిందో తరచి చూస్తే… 

·      2025లో వియత్నాం అంతర్జాతీయ గమ్యస్థానంగా అవతరించింది, ట్రాఫిక్‌లో 133% పెరుగుదలను నమోదు చేసింది.

·      అంతర్జాతీయ విశ్వాసానికి ప్రధాన చోదక శక్తి క్లియర్‌ట్రిప్ వీసా తిరస్కరణ కవర్.

·       వారణాసి మరియు అండమాన్ దీవులకు ట్రాఫిక్ సగటున 20% పెరిగింది,

·      2025లో ఉత్తరప్రదేశ్ అత్యధికంగా సందర్శించబడింది. ప్రయాగ్‌రాజ్ (3x) మరియు బరేలీ (4x) లలో వసతి కోసం శోధనలు గణనీయంగా పెరిగాయి.

·      ఈ సంవత్సరం ఢిల్లీ మరియు బెంగళూరు మొదటి రెండు సోలో ట్రావెల్ గమ్యస్థానాలుగా నిలిచాయి.  ఢిల్లీకి  హిమాచల్ ప్రదేశ్, జైపూర్ మరియు ఆగ్రా నుంచి అత్యధిక రాకపోకలు జరిగాయి. అదేవిధంగా, బెంగళూరుకు కూర్గ్, ఊటీ మరియు కొడైకెనాల్ నుంచి  లీజర్ లేదా ఐటీ/టెక్ పార్కులు? లేదా రెండింటి కోసం సందర్శనలు జరిగాయి . 

·      2025లో ఫుకెట్, కౌలాలంపూర్ మరియు బ్యాంకాక్ అత్యంత ప్రజాదరణ పొందిన గమ్యస్థానాలుగా ఆవిర్భవించాయి.

2025లో చిన్న ట్రెండ్‌లు ఆవిర్భవించాయి:

o   ప్రయాణికులు పని కంటే ప్రశాంతతను ఇష్టపడినప్పుడు, వారు రిషికేశ్, కూర్గ్ మరియు అల్లెపీలకు  కామ్ కేషన్  ( ‘ప్రశాంతత’) ను తీసుకున్నారు.

o   పనికి ఇష్టపడేవారు లేదా రిమోట్‌గా పనిచేస్తున్నారా? గోవా, పాండిచ్చేరి మరియు డార్జిలింగ్ అగ్ర శ్రేణి ‘వర్కేషన్’ ప్రదేశాలుగా నిలిచాయి. 

o    స్పితి, అండమాన్ మరియు లడఖ్ ‘డిజిటల్ డిటాక్స్’ కోసం అగ్ర శ్రేణి ఎంపికలు.

o   ఈ సంవత్సరం భారతదేశంలోని ‘అడ్వెంచర్ జంకీలు’ బిర్ బిల్లింగ్, లక్షద్వీప్ మరియు ఔలికి తరలివచ్చారు.

విచిత్రమైన, అత్యుత్సాహం కలిగిన యాత్రికులు మరియు వారు దారిలో చేసిన గందరగోళం

·      కర్ణాటకలోని చిక్కమగళూరులో బస చేయడానికి ఎవరో 361 రోజుల ముందుగానే బుక్ చేసుకున్నారు. మరొకరు గోవాలోని రిబందర్‌లో 350 రోజుల ముందుగానే బసను బుక్ చేసుకున్నారు.

·      3,00,000 మంది వ్యక్తులు తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్య టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య విమానం అయిన 353 ఎయిర్‌బస్-380ని నింపడానికి ఇది సరిపోతుంది!

·       బెంగళూరులో ఒక ప్రయాణికుడు ఒక చోట  వరుసగా 30 రోజులు బస చేశాడు. కోల్‌కతాలో మరొక ప్రయాణికుడు వరుసగా 29 రోజులు బస చేశాడు.

·      క్లియర్‌ట్రిప్‌లో బుక్ చేసుకున్న చౌకైన విమానం ధర రూ. 0 (ఆఫర్‌లు మరియు వాలెట్ క్రెడిట్‌ల ద్వారా పూర్తిగా రీడీమ్ చేయబడింది). చౌకైన బస ధర రూ. 48. ఈ వ్యక్తులు ఇప్పుడు కేస్ స్టడీస్ గా నిలిచారు!

·      ఒక ప్రయాణికుడు ఢిల్లీ- గౌహతి విమానానికి రూ. 2,40,000 ఖర్చు చేయగా, మరొకరు పారిస్- ముంబై విమానానికి రూ. 4,43,000 వెచ్చించారు.

·      ఈ సంవత్సరం బుక్ చేసుకున్న అత్యంత ఖరీదైన హోటల్ బస మాల్దీవులలో రూ. 4,41,000కు చేరింది. ఇది బహుశా మరిచిపోయిన వివాహ వార్షికోత్సవ సందర్భం కావచ్చని మేము భావిస్తున్నాము…

·      ఘజియాబాద్–బెంగళూరు విమానంలో ఒకరు కేవలం అదనపు సామాను కోసమే రూ. 65,000 ఖర్చు చేశారు.

విమానం బయలుదేరడానికి 48 గంటల ముందు 38,00,000 విమాన బుకింగ్‌లు జరిగాయి, ఇది ఆకస్మికంగా, చివరి నిమిషంలో ప్రయాణించడానికి భారతీయులలో పెరుగుతున్న సౌకర్యాన్ని సూచిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -