- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్ణాటక రాజధాని బెంగళూరులో ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు బెంగళూరులో జరిగిన మెట్రో ప్రారంభోత్సవ వేడుకలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఆదివారం బెంగళూరులో ఎల్లో లైన్ మెట్రో సేవల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్వీ రోడ్ మెట్రో స్టేషన్లో ప్రధానికి స్వాగతం పలికిన సీఎం సిద్ధరామయ్య.. పుష్పగుచ్ఛం అందిస్తూ మోడీని పలకరించారు. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రాజెక్టు వివరాలను ప్రధానికి వివరించారు. కార్యక్రమం పూర్తయ్యాక ముగ్గురు నేతలు కలిసి కొత్త మెట్రో రైలులో ప్రయాణించారు.
- Advertisement -