- Advertisement -
ఎన్నికల్లో గెలుపుపై రేవంత్కు అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై వారిరువురూ చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంపై ప్రియాంక గాంధీ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆమె ప్రత్యేక్యంగా అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలు సంతృప్తిగా ఉన్నందున కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రియాంక గాంధీకి తెలిపారు.
- Advertisement -



