నవతెలంగాణ – రామారెడ్డి : ఆస్పత్రిలో చికిత్స పొంది, ఆర్థిక ఇబ్బందులతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా శుక్రవారం మండలంలోని గిద్ద గ్రామానికి చెందిన వడ్ల లావణ్యకు రూ.33,500, నీరడి శ్రావణ్ కు రూ .18,000 విలువ గల చెక్కులను మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గౌడ్, శీలసాగర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మదన్మోహన్రావు నియోజకవర్గంలో ప్రజల కోసం పాటుపడుతున్న ప్రజా నాయకుడని అన్నారు. బాధిత కుటుంబం మదన్ మోహన్ రావు తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుఫ్, మండల మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు నామాల రవి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES