నవతెలంగాణ – జన్నారం : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం అని కాంగ్రెస్ పార్టీ జన్నారం పట్టణ అధ్యక్షుడు దూమల్ల రమేష్ అన్నారు. శనివారం జన్నారం పట్టణానికి చెందిన మేకల శేఖర్ కు మంజూరైన 13 వేల రూపాయల సిఎం రిలీఫ్ండ్ నుండి వచ్చిన చెక్కను వారికి అందించారు. సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుంది అన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం విద్యా, వైద్యం కు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ మామిడి పెళ్లి ఇందయ్య నాయకులు బీరవేణి గంగన్న దుమల్ల ప్రవీణ్ ఐలవేణి శ్రీను చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES