Tuesday, September 9, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి

ఢిల్లీలో సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నేడు కేంద్రమంత్రి గడ్కరీతో సమావేశం

నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి బిజి బిజీగా గడపనున్నారు. ప్రధానం గా రాష్ట్రాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, హైవేల మంజూరు, వరద సాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఆర్థిక సాయంపై పలువురు మంత్రులను కలిసి విజ్ఞప్తులు అందజేయనున్నారు. పర్యటనలో భాగంగా సోమవారం రాత్రి 8:40కి సీఎం ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తుగ్లక్‌ రోడ్‌లోని సీఎం అధికారిక నివాసానికి చేరుకొని బస చేశారు. నేడు (మంగళవారం) ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌ నేపథ్యంలో ఢిల్లీ నుంచి సమీక్షించనున్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలతో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఇండియా బ్లాక్‌ అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి ఓటు వేయాలని దిశా నిర్దేశం చేయనున్నారు.

సాయంత్రం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్‌ భేటీ కానున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో కీలకంగా రీజినల్‌ రింగ్‌ రోడు ్డ(ఆర్‌ఆర్‌ఆర్‌) దక్షిణ భాగానికి సంబంధించిన అనుమతులపై చర్చించను న్నారు. అలాగే హైదరాబాద్‌-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం మరోసారి అభ్యర్థించనున్నారు. ఈ హైవే విషయంలో గత మీటింగ్‌లోనే కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినా.. పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ఈ అంశాన్ని ప్రధానంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో పలు హైవే ప్రాజెక్ట్‌లు, డ్రైపోర్ట్‌లపై కూడా విజ్ఞప్తులను అందజేయనున్నారు. అలాగే పార్టీ హై కమా ండ్‌ ముఖ్యనేతలు, ఇతర మీటింగ్‌ల లోనూ సీఎం పాల్గొనే అవకాశం ఉంది.

రేపు రాజ్‌నాథ్‌, షా, నిర్మలతో భేటీ
భారీ వర్షాల కారణంగా నెలకొన్న వరద నష్టం, తాజా పరిస్థితులను సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. కేంద్ర విపత్తు నిర్వహణ, హోం మంత్రి అమిత్‌ షాతో సీఎం రేపు (బుధవారం) భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో వరద విపత్తు పరిస్థితులను సీఎం వివరించను న్నారు. ముఖ్యంగా కామారెడ్డి, ఖమ్మం, ఇతర ప్రాంతాల్లో నెలకొన్న వరద నష్టంపై ప్రాథమిక నివేదికను అందజేయనున్నట్టు తెలిసింది. ఇందుకు తగ్గట్టుగా కేంద్రం నుంచి ఆర్థిక సహకారం కోరనున్నారు. అలాగే కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కలిసి హైదరాబాద్‌లోని మౌలిక వసతుల రూపకల్పనలో భాగంగా కావాల్సిన డిఫెన్స్‌ భూముల ను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించా లని కోరనున్నారు. ఇప్పటికే అనేక సార్లు ఈ విజ్ఞప్తి రక్షణ శాఖ ముందు పెట్టినా… నిర్ణయాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. దీంతో ఈ భేటీలో ఆ భూముల బదలాయింపుపై విజ్ఞప్తి చేయనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్‌తోనూ సీఎం భేటీ కానున్నట్టు సీఎంఓ వర్గాలు తెలిపాయి. ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు ఆర్థిక సహకారం అందించాలని కోరనున్నారు. అలాగే గత ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లకు తెచ్చిన అప్పులకు సంబంధించి లోన్‌ రిస్ట్రక్చర్‌ చేయాలని కోరే ఆస్కారం ఉంది. దీంతో పాటు కేంద్రం నుంచి వివిధ స్కీంలు, సంక్షేమ పథకాలకు రావాల్సిన పెండింగ్‌ బకాయిలు త్వరితగతిన విడుదల చేయాలని కోరనున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad