- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని నాగర్కర్నూల్ జిల్లా మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని అమ్రాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలో అటవీ హక్కుల చట్టం కింద 6.69 లక్షల ఎకరాల విస్తీర్ణానికి (2.30 లక్షల మంది ఎస్టీ రైతులకు) పోడుపట్టాలు మంజూరయ్యాయి. ఇందులో విద్యుత్తు సౌకర్యం లేని 6 లక్షల ఎకరాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. గిరిజన రైతుకు రెండున్నర ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉంటే సింగిల్ యూనిట్, అంతకు తక్కువగా ఉంటే.. సమీప రైతులను కలిపి బోర్వెల్ యూజర్ గ్రూపుగా ఏర్పాటు చేస్తారు.
- Advertisement -