- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నల్గొండ జిల్లా దేవరకొండలో డిసెంబర్ 6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.6.50 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అలాగే మహిళా సంఘాలకు రూ.11.33 కోట్ల విలువైన చెక్కులను పంపిణీ చేస్తారు. ప్రజాపాలన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
- Advertisement -



