- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గెటప్లో వినాయకుడి విగ్రహం దర్శనమిచ్చింది. గోషామహల్ నియోజకవర్గం ఆఘాపురలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ రైజింగ్ పేరుతో ఈ వినాయకుడిని ఏర్పాటు చేశారు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, మెడలో ఆకుపచ్చ కండువా వేసుకున్న సీఎం రేవంత్ రెడ్డిని పోలినట్లుగా విగ్రహాన్ని రూపొందించారు.
- Advertisement -