రైతు వేదికల్లో ఏర్పాట్లు…
వీసీ యూనిట్ లు అందజేత..
రైతు భరోసా నిధుల విడుదల..
ఎంపీడీవో ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఈ నెల 16 సోమవారం రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం జరుగుతుందని శనివారం ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతోసాయంత్రం నాలుగు గంటలకు ముఖాముఖి మాట్లాడుతారని అన్నారు. ఈనేపథ్యంలో కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు. మండలంలోని అనంతారం, అశ్వారావుపేట, నారాయణపురం రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్దం చేస్తామని అన్నారు. సోమవారం అన్ని రైతు వేదికలను పండుగ వాతావరణంలో మామిడి తోరణాలు, రంగవల్లులతో అలంకరించనున్నట్లు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకే రైతు వేదిక వద్దకు రైతులు చేరుకునేలా స్వయం సహాయక మహిళా సంఘాలు సభ్యులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆడియో వీడియోలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా సరి చూసుకోవాలని ఏవైనా సమస్యలు ఉంటే రేపటి లోగా పూర్తి చేయాలని స్థానికి సిబ్బందిని ఆదేశించారు. రైతు వేదికల కు విచ్చేసే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని అన్నారు. మహిళా రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పలకాలని సిబ్బందికి సూచించారు. రైతు వేదికలు కు పెద్ద ఎత్తున రైతులు హాజరవుతారు కాబట్టి, రైతు వేదికల వెలుపల డ్రైవ్ పై అవగాహన కల్పించే విధంగా స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు నేస్తం కార్యక్రమానికి రైతు వేదిక పరిధిలో మునగ సాగు చేపట్టి లబ్ధి చేకూరిన రైతులను ఆహ్వానించి వారి ద్వారా ఇతర రైతులకు మునగ సాగు ద్వారా వచ్చే లాభాల పై అవగాహన కల్పించాలన్నారు. రైతు నేస్తం కార్యక్రమానికి మండల వ్యాప్తంగా ఉన్న మహిళా సమైక్య సభ్యులు హాజరు కావాలని కోరారు. మధ్యాహ్నం 3 గంటలకు అనంతారం రైతు వేదిక నందు రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిచే ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగును. కావున రైతులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.