- Advertisement -
నవతెలంగాణ – మోపాల్: మండలంలోని బాడ్స్, సింగంపల్లి గ్రామాల్లోని లబ్దిదారులకు సుమారు రూ.6 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పీసీసీ డెలిగేట్, నిర్మల్ జిల్లా పరిశీలకులు శేఖర్ గౌడ్ ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ మోహన్ రెడ్డి, నాయకులు రవి, మల్లయ్య, జగదీశ్ రెడ్డి, చాకలి లింగం, కొండూరు దాస్, గూండ్ల పోశెట్టి, కాల్పోల్ వంశీ, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -