Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల వైద్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్

పేదల వైద్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజల వైద్యానికి ఎంతో భరోసానిస్తుందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేల ప్రవీణ్ అన్నారు. బుధవారం మండలంలోని హాస కొత్తూర్ గ్రామంలో పలువురు లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు. పడిగెల సంజీవ్ కు రూ.50వేలు, వాల్గోట్ శశివర్ధన్ కు రూ. 17వేలు, కటికే నర్సు బాయికి రూ.20వేల ఆర్థిక సహాయం చెక్కులు మంజూరు అయ్యాయి. అట్టి చెక్కులను లబ్ధివాదుల ఇంటి వద్దకు వెళ్లి అందజేశారు.ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకున్న లబ్ధిదారులు  వైద్య ఖర్చులకోసం దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం చెక్కులను మంజూరు చేస్తుందన్నారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం ద్వారా ఎంతోమంది రోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూరుతుందన్నారు. ఆర్థిక సహాయం చెక్కుల మంజూరుకు కృషిచేసిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రేవతి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు గోపిడి లింగారెడ్డి, కుందేటి శ్రీనివాస్, ఎడ్ల శ్రీకాంత్, బద్దం రవి, మేడమ్ రమేష్, మోదిని శ్రీధర్, మేకల క్రాంతి, పడల మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -