జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ వీరారెడ్డి…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : జూన్ 6న సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలో వివిధ అభివృద్ధి, సంక్షేమ పనులకు శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా అధికారులంతా అప్రమత్తంగా ఉంటూ ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రోజు మినీ మీటింగ్ హాల్ లో సీఎం పర్యటన సందర్భంగా జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ ,రెవెన్యూ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీ రాజ్,అర్ అండ్ బి ,ట్రాన్స్ పోర్ట్, ఎలక్ట్రిసిటీ, ఫైర్, పంచాయితీ, ఎక్సైజ్ , వైద్య శాఖ,మిషన్ భగీరథ, ట్రాన్స్ కో , డిపిఆర్ఓ,సివిల్ సప్లై ,వ్యవసాయ శాఖ, ట్రాఫిక్ తదితర శాఖల ఏర్పాట్ల పై సమీక్షించారు.వివిధ శాఖలు అధికారులు సంపూర్ణ సమన్వయంతో పని చేయాలని, పకడ్బందీగా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ శోభారాణి, డి ఆర్డి ఓ నాగిరెడ్డి, ఎస్సీ ఇరిగేషన్ శ్రీనివాస్, పంచాయతీరాజ్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు,జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.