- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో రాబోయే 10 రోజుల్లో (నవంబర్ 11-19) చలి తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ, తెలంగాణ ప్రణాళిక అభివృద్ధి సంఘం హెచ్చరించాయి. నవంబర్ 13 – 17 తేదీల మధ్య చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వెల్లడించాయి. ఈ మేరకు రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, SRD, మెదక్, SDPT, కామారెడ్డి, ADLB, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 10 డిగ్రీల సెంటిగ్రేడ్ లోపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపాయి. ఈ మేరకు ఆసిఫాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసాయి.
- Advertisement -



