Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్...

ఇందిరమ్మ ఇండ్ల  నిర్మాణాలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్…

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని, జిల్లాలో పారిశుద్ధ్యం పై శ్రద్ధ చూపాలని ,వన మహోత్సవంలో భాగంగా జిల్లా లో మొక్కలు నాటి లక్ష్యాలను  చేరుకోవాలని, వంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయాలని,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులకు సూచించారు..

బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశం మందిరంలో అన్ని మండలాల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు,లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ.. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో  ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో   యాదాద్రి భువనగిరి జిల్లాను  అగ్రగామి గా ఉంచాలని కోరారు.  ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు.లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని,ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.   బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముగ్గు పోసి,ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. 

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు,విత్తనాలు పూర్తి స్థాయి లో అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా  ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు.జిల్లాలో ఎక్కడ కూడా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. రైతులకు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. విత్తనాలు,ఎరువుల కారణంగా ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. నకిలీ ఎరువులు, నాసిరకం విత్తన విక్రయాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు  చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ , పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచుకొని ఎక్కడైతే నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపిస్తాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఉపయోగించాలన్నారు. గ్రామాలలో ప్రతి  ఫ్రై డే ను – డ్రై డే గా తూచా తప్పకుండా పాటించాలన్నారు.

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడానికి  అనువైన ప్రదేశాన్ని  గుర్తించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రణాళిక లను సిద్ధం  చేసుకొని మన మహోత్సవ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో  రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జడ్పీ సీఈఓ శోభారాణి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పీడీ విజయసింగ్, డిపిఓ సునంద,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

x

నవ తెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలలో స్పష్టమైన ప్రగతి కనిపించేలా అధికారులు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని, జిల్లాలో పారిశుద్ధ్యం పై శ్రద్ధ చూపాలని ,వన మహోత్సవంలో భాగంగా జిల్లా లో మొక్కలు నాటి లక్ష్యాలను  చేరుకోవాలని, వంటి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయాలని ,యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు సంబంధిత అధికారులకు సూచించారు..

బుధవారం రోజు కలెక్టరేట్ సమావేశం మందిరంలో అన్ని మండలాల స్పెషల్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు,లతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లడుతూ.. ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు వెంటనే నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసేలా సంబంధిత అధికారులు సమన్వయంతో  ప్రోత్సహించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో నిర్మాణపు పనులు పూర్తి చేయడంలో   యాదాద్రి భువనగిరి జిల్లాను  అగ్రగామి గా ఉంచాలని కోరారు.  ఇందిరమ్మ ఇంటిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంతే త్వరగా బిల్లులు కూడా అందిస్తామని లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు.లక్ష్యానికి అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా నిరంతర పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ అధికారులను కోరారు. ఒక్కో మండలం వారీగా కేటాయించిన లక్ష్యం, లబ్ధిదారుల నిర్ధారణ, మంజూరీలు తెలిపిన వాటిలో ఎన్ని ఇళ్ల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి, అవి ఏ దశలో ఉన్నాయి, క్షేత్రస్థాయిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను ఆరా తీశారు. లబ్ధిదారుల ఎంపిక, గ్రౌండింగ్ విషయంలో వెనుకంజలో ఉన్న మండలాలను గుర్తించి, లక్ష్య సాధన కోసం అంకిత భావంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో లబ్దిదారులను నేరుగా కలిసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా ప్రోత్సహించాలని,ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియను నిశిత పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఇళ్ల నిర్మాణాలకు నిధుల సమస్య ఎంతమాత్రం లేదని, నిర్మాణాలు చేపడుతున్న లబ్దిదారులకు ఆయా దశలను బట్టి వెంటవెంటనే వారి ఖాతాలలో నిధులు జమ చేయడం జరుగుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.   బేస్మెంట్ లెవెల్ వరకు నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ముగ్గు పోసి,ఇల్లు పునాది తీసుకునేలా అధికారులు చొరవ చూపాలన్నారు. 

ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు సంబంధించి జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువులు,విత్తనాలు పూర్తి స్థాయి లో అందుబాటులో ఉంచాలని వ్యవసాయ అధికారులను కోరారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది పడకుండా  ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు.జిల్లాలో ఎక్కడ కూడా విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలన్నారు. రైతులకు విత్తనాలు,ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. అన్ని ఎరువులు, విత్తన విక్రయ దుకాణాలలో క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. విత్తనాలు,ఎరువుల కారణంగా ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని అన్నారు. నకిలీ ఎరువులు, నాసిరకం విత్తన విక్రయాలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, రైతులను నష్టపరిచే చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా తదితర వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు  చేపట్టాలన్నారు. దోమల వ్యాప్తిని నిరోధించేందుకు ఫాగింగ్ , పెద్ద ఎత్తున ఆయిల్ బాల్స్ అందుబాటులో ఉంచుకొని ఎక్కడైతే నీరు నిల్వ ఉండి దోమలు వ్యాపిస్తాయో అక్కడ ఆయిల్ బాల్స్ ఉపయోగించాలన్నారు. గ్రామాలలో ప్రతి  ఫ్రై డే ను – డ్రై డే గా తూచా తప్పకుండా పాటించాలన్నారు.

వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడానికి  అనువైన ప్రదేశాన్ని  గుర్తించాలన్నారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ప్రణాళిక లను సిద్ధం  చేసుకొని మన మహోత్సవ కార్యక్రమాన్ని  విజయవంతం చేయాలన్నారు. నాటిన మొక్కల వివరాలను ఎప్పటికప్పుడు జియో కో-ఆర్డినేట్స్ తో ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.

ఈ సమీక్ష సమావేశంలో  రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల  అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, జడ్పీ సీఈఓ శోభారాణి, రెవిన్యూ డివిజనల్ అధికారులు, కృష్ణా రెడ్డి, శేఖర్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పీడీ విజయసింగ్, డిపిఓ సునంద,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -