Thursday, June 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జీజీహెచ్, మెడికల్ కళాశాలలను సందర్శించిన కలెక్టర్, హెల్త్ డైరెక్టర్

జీజీహెచ్, మెడికల్ కళాశాలలను సందర్శించిన కలెక్టర్, హెల్త్ డైరెక్టర్

- Advertisement -

అందుబాటులో ఉన్న సదుపాయాల పరిశీలన
వైద్య విభాగాల అధిపతులతో సమీక్ష
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, వైద్య కళాశాలలను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ రవీందర్ నాయక్ గురువారం సందర్శించారు. వివిధ విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. ఆస్పత్రిలో ఐ.సీ.యు, ఆర్.ఐ.సీ.యు, ల్యాబ్, బ్లడ్ బ్యాంకు, టీ.హబ్ తదితర వాటిని తనిఖీ చేశారు. వైద్య కళాశాలలో ఫిజియాలజి, అనాటమీ, హెమటాలజి ల్యాబులు, లైబ్రరీ, లెక్చర్ హాల్ ఇతర విభాగాలను సందర్శించారు. అనంతరం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఆయా విభాగాల అధిపతులతో సమావేశమై అన్ని అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఒక్కో విభాగం వారీగా రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, డాక్టర్లు, సిబ్బంది ఖాళీలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంకనూ కొత్తగా సమకూర్చాల్సిన సదుపాయాలు తదితర వాటి గురించి కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

జాతీయ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) మార్గదర్శకాలకు అనుగుణంగా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ మేరకు కొత్తగా ఏయే సదుపాయాలు, వైద్య పరికరాలు, యంత్రాలు అవసరం అన్నది గుర్తిస్తూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శివప్రసాద్ లను ఆదేశించారు. ఈ నివేదికను అనుసరిస్తూ సదుపాయాల మెరుగుదల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.

ఆస్పత్రి, మెడికల్ కాలేజీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, తమ దృష్టికి తేవాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా ప్రజలకు సంతృప్తికరంగా వైద్య సేవలు అందించాలని, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని సూచించారు. అన్ని విభాగాల పనితీరు మరింతగా మెరుగుపడేలా అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, వైద్య సేవల్లో జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. తాను క్రమం తప్పకుండా ఆసుపత్రిని తనిఖీ చేస్తానని, వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు.

జీజీహెచ్ ఆధ్వర్యంలో అందిస్తున్న అధునాతన వైద్య సేవల గురించి ప్రజలకు తెలిసేలా చూడాలని, తద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పెంపొందుతుందని సూచించారు. వైద్య కళాశాలలో జాతీయ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, తద్వారా ఎన్ఎంసీ అనుమతుల మంజూరీలో ఇబ్బందులకు ఆస్కారం ఉండదని కలెక్టర్ సూచించారు. వైద్య విద్యార్థులు సంఖ్యకు అనుగుణంగా ప్రొఫెసర్ లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఉండాలన్నారు. ఆయా విభాగాలలో ఖాళీలు ఉంటే, వాటి వివరాలను సమర్పించాలని కళాశాల ప్రిన్సిపాల్ కు సూచించారు. వీరి వెంట డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, వైద్య విభాగాల అధిపతులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -