Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామారెడ్డిలో ఇసుక అవసరంపై కలెక్టర్ సమీక్ష..

కామారెడ్డిలో ఇసుక అవసరంపై కలెక్టర్ సమీక్ష..

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ కామారెడ్డి జిల్లాలో జరుగుతున్న వివిధ  ప్రభుత్వ  పనులకు సంభందించి ఎంత మేరకు ఇసుక అవసరం గురుంచి వివిధ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్లతో సమావేశము నిర్వహించారు. స్థానిక అవసరాల నిమిత్తము  1,2, 3 ఆర్డర్ స్ట్రీమ్ లలో తీసే ఇసుకపై నిఘాను పటిష్టము చేయవలసిందిగా ఆదేశించారు. కావున జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాలు తమకు కావలసిన ఇసుకను తెలంగాణ ఖనిజ అభివృద్ధి సంస్థ యొక్క ఆన్లైన్ పోర్టల్ sand.telangana .gov .in ద్వారా మాత్రమే ఇసుకను బుక్ చేసుకోవలసిందిగా సూచించారు. ఈ సమావేశానికి   జిల్లా కలెక్టర్  ఆశిష్  సంగ్వాన్, విక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ ), పి. నాగేష్ ,(సహాయ సంచాలకులు, గనులు, భూ గర్భ శాఖ ),  విఠలేశ్వర్  (ప్రాజెక్ట్ ఆఫీసర్, టి జి యం డి సి ), రవి శంకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆర్, బి, ఎం. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి, రమేష్ , మిషన్ భగీరథ ఈ ఈ, ఇతర ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -