నవతెలంగాణ – కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ షాంగ్వాన్ యోగా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు కామారెడ్డి పట్టణంలోని సరస్వతి విద్యా మందిరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు జరుగనున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పత్రికా విలేకరులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ , అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్, ఆర్డిఒ వీణ, డిఎంహెచ్ఒ చంద్రశేఖర్, ఆయుష్ నోడల్ ఆఫీసర్ డా. వెంకటేశ్వర్లు, ప్రకృతి వైద్యాధికారి డా. దేవయ్య, ఆయుష్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ ఆకుల శ్రీకాంత్, ఎన్ఎచ్ఎమ్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ పద్మజ గారు, యోగా శిక్షకులు లింగమూర్తి , జిల్లా అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
యోగా దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES