Monday, June 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంయావజ్జీవ శిక్ష నుంచి కల్నల్‌ శర్మకు విముక్తి

యావజ్జీవ శిక్ష నుంచి కల్నల్‌ శర్మకు విముక్తి

- Advertisement -

కింది కోర్టు తీర్పును రద్దు చేసిన హైకోర్టు
నవతెలంగాణ-హైద రాబాద్‌బ్యూరో

లైంగికదాడి కేసులో పాస్ట్‌ట్రాక్‌ కోర్టు హైదరాబాద్‌ శామీర్‌పేట్‌ డీఆర్‌డీవో ఏవో కల్నల్‌ రిషిశర్మకు విధించిన జీవితఖైదును హైకోర్టు రద్దు చేసింది. కల్నల్‌ రిషిరశ్మను నిర్దోషిగా ప్రకటించింది. కేసుల దర్యాప్తులో అధికారుల తీరును, లోపాలను ఎత్తిచూపింది. తన తల్లికి సన్నిహితుడైన కల్నల్‌ శర్మ తనపై
లైంగికదాడి చేయడం వల్ల తాను గర్భం దాల్చినట్టు బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 2017లో కేసు నమోదు చేశారు. దీనిపై స్పెషల్‌ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2024లో కల్నల్‌ శర్మను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును కల్నల్‌ శర్మ హైకోర్టులో సవాలు చేశారు. ఫిర్యాదుదారు గర్భం దాల్చితే ఆలస్యంగా ఫిర్యాదు చేయడానికి కారణాలు పేర్కొనలేదనీ, అబార్షన్‌ చేయించుకున్నా పిండానికి డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించలేదనీ, అందువల్ల కింది కోర్టును తీర్పును రద్దు చేస్తున్నట్లు జస్టిస్‌ పీ సామ్‌కోషి, జస్టిస్‌ ఎన్‌ తుకారాంజీ ధర్మాసనం ప్రకటించింది. కల్నల్‌ శర్మ 2005లోనే వేసెక్టమీ చేయించుకున్నారని సర్టిఫైడ్‌ సర్టిఫికెట్‌ నిరూపిస్తోందని తెలిపింది. డీఎన్‌ఏ నివేదిక అసంపూర్ణంగా ఉందని, గర్భస్రావానికి సంబంధించిన వివరాలు అసమగ్రంగా ఉన్నాయని పేర్కొంది. కేసుల దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌శాఖ అనుసరిస్తున్న తీరు లోపభూయిష్టంగా ఉందనీ, ఈ ప్రక్రియలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ విధానం వల్ల క్రిమినల్‌ జస్టిస్‌ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందనీ, సరైన దర్యాప్తు జరగకపోతే దాని ప్రభావం న్యాయ ప్రక్రియపై పడి, పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని హెచ్చరించింది. చట్టపరమైన సవాళ్లు, న్యాయం అందించడంలో జాప్యం జరగకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది.
గాలి అప్పీల్‌ పిటిషన్‌ చెల్లదు : సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు
ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డిని దోషిగా నిర్థారిస్తూ సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టులో సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. గాలి ఇతరులు దోషులని కింది కోర్టు తీర్పు చెప్పిందనీ, దోషిగా ఉన్న వ్యక్తి ఏస్థాయిలోని వారైనా ఒక్కటేనని పేర్కొంది. దోషులకు ప్రత్యేకతలు ఏమీ ఉండవనీ, సీబీఐ కోర్టు విధించిన శిక్ష అమలును నిలిపివేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. శిక్షను నిలిపివేయకపోతే గాలి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి ఏం నష్టం వస్తుందో కూడా వివరించలేదని తప్పుపట్టింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ మే 6న సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. ఓఎంసీ డైరెక్టర్లు బి.వి.శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి, గాలి పీఏ మెఫజ్‌అలీఖాన్‌, గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వి.డి.రాజగోపాల్‌లకు శిక్ష విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఎమ్మెల్యే గాలి జనార్దన్‌రెడ్డి అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. శిక్ష అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ మధ్యంతర పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని కొట్టేయాలని సీబీఐ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఎమ్మెల్యేగా కొనసాగడం ప్రాథమిక హక్కు కాదని చెప్పింది. గాలి పిటిషన్‌ విచారణార్హత లేదనీ, దాన్ని కొట్టేయాలని కోరింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -