Sunday, November 2, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి

పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రండి

- Advertisement -

కెనడా కమిషనర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కెనడా హైకమిషనర్‌ను కోరారు. హైకమిషనర్‌ ఆఫ్‌ కెనడా టు ఇండియా క్రిస్టోఫర్‌ కూటర్‌ బృందం శనివారం హైదరాబాద్‌లో సీఎంతో భేటీ అయ్యింది. ఐటీ, ఫార్మా, ఎయిరోస్పేస్‌, డిఫెన్స్‌, అర్బన్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించారు. తమ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను కెనడా హైకమిషనర్‌కు సీఎం వివరించారు. స్టార్టప్స్‌, ఎడ్యుకేషన్‌, అడ్వాన్స్డ్‌ టెక్నాలజీ సెంటర్లలోనూ పెట్టుబడులకు ముందుకు రావాలని ఆయన ఈ సందర్భంగా కెనడా హైకమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. భేటీలో కారెన్‌, కెనడా మంత్రి ఎడ్‌ జాగర్‌, ట్రేడ్‌ కమిషనర్‌ విక్రమ్‌ జైన్‌, స్పెషల్‌ సీఎస్‌ జయేష్‌ రంజన్‌, విష్ణువర్ధన్‌ రెడ్డి, అజిత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -