Wednesday, January 14, 2026
E-PAPER
Homeజాతీయంపరిహారం చెల్లించాల్సిందే..!

పరిహారం చెల్లించాల్సిందే..!

- Advertisement -

కుక్క కాటుపై రాష్ట్రాలకు సుప్రీంకోర్టు హెచ్చరిక
వీధికుక్కలకు ఆహారం పెడుతున్న వారిపై అసహనం
ప్రేముంటే ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాళంటూ సూచన
న్యూఢిల్లీ :
కుక్కల బెడదను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోకపోతే ఆయా రాష్ట్రాలపై భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో గతేడాది నవంబరులో సుప్రీం కీలక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, క్రీడా సముదాయాలు, బహిరంగ ప్రదేశాల్లోని వాటిని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. ఈ అంశంపై మంగళవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రతి కుక్క కాటుకు పరిహారం చెల్లించాల్సిందేనని స్పష్టంచేసింది. కుక్క కరిచిన ప్రభావం బాధిత వ్యక్తిపై జీవితకాలం ఉంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న వారిపైనా న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ”మీకు శునకాలపై ప్రేముంటే.. వాటిని మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి. వీధి కుక్కల సమస్య భావోద్వేగభరిత అంశమని అంటున్నారు. ఈ భావోద్వేగం కుక్కలపై మాత్రమేనా? మేం మనుషుల గురించి కూడా ఆందోళన చెందు తున్నాం. కుక్కలు వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయపెట్టే పరిస్థితిని ఆమోదించం” అని ధర్మాసనం వెల్లడించింది.
అంతేకాక ”ఏదైనా ఒక సంస్థ కుక్కలకు ఆహారం పెడుతుండడం, ఆ కుక్కల దాడిలో ఓ చిన్నారి మరణిస్తే.. అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ఆ ప్రాణనష్టానికి సదరు సంస్థ బాధ్యత వహించదా? వీధి కుక్కల బెడదను నివారించేందుకు రాష్ట్రాలు తగిన చర్యలు చేపట్టాలి. లేదంటే ప్రతి కుక్క కాటుకు, కుక్కల దాడిలో జరిగిన ప్రతి మరణానికి గానూ ఆయా రాష్ట్రాలపై మేం నిర్దేశించిన భారీ పరిహారాలను చెల్లించాలి” అని న్యాయస్థానం స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -