నవతెలంగాణ – పెద్దవంగర: నిత్యం యోగ సాధనతో ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎంఈవో బుధారపు శ్రీనివాస్, పల్లె దావఖాన వైద్యాధికారులు మహిపాల్, రాజ్ కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మండల వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో వారు వేరువేరుగా పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వయో, లింగ భేదం లేకుండా అందరూ యోగా సాధన చేయాలన్నారు. యోగా లో సూర్య నమస్కారాలకు ప్రత్యేకత ఉందన్నారు. మనిషిలో తేజస్సు, కండర పుష్టి ధృడత్వం, రక్త ప్రసరణ, చర్మ సౌదర్యం, అతి బరువు తగ్గడంతో పాటు, నరాల వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుందని అన్నారు. ఇళ్లల్లో ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES