నవతెలంగాణ – కంఠేశ్వర్: ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా జీవించడానికి యోగా సాధనంగా ఉపయోగపడుతుందని 26వ తేదిన నిర్వహించే కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోనలని పిలుపునిచ్చారు. నగరంలోని ఆరోగ్య రక్ష కేంద్రం నందు ఈ నెల 26వ తేదిన ఆరోగ్యరక్ష, ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రజల్లో యోగా పై మరింత అవగాహన కల్పించే విధంగా పలు కార్యక్రమాలను నిర్వహించటం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆరోగ్యరక్ష నిర్వహుకురాలు డా.ఐశ్వర్య మాట్లాడుతూ.. యోగా సాధనతో మానసిక ,శారిరక సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, సూజాత రెడ్డి, మద్ది గంగాధర్, డాన్స్ మాస్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES