– నాణ్యమైన విద్య, ఆహారం అందించడమే లక్ష్యం
– రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ మెళుకువలు కలిపిస్తుందని, విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యరంగలో రాణించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం హుస్నాబాద్ కేజీబీవీ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ , జిల్లా కలెక్టర్ ఎం మన చౌదరి కలిసి ప్రారంభించారు. వేసవి సెలవుల అనంతరం నేడు పాఠశాలలు పునః ప్రారంభం అవడంతో విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయర్ లో మొదటి కంప్యూటర్ ల్యాబ్ హుస్నాబాద్ కేజీబీవీకి మంజూరు అయిందన్నారు. స్కూల్ కి పెయింట్ వేయించాలని కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ లో ఎలాంటి నియామకాలు అవసరమైన సిద్ధం చేయాలని తెలిపారు. విద్యార్థులకు మంచి విద్య, నాణ్యమైన ఆహారం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వ పాఠశాలలు లలో విద్యార్థులను చేర్పించడానికి మంచి కార్యక్రమాలు చేపట్టలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు..
విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ మెళుకువలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES