Monday, June 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిర్బంధ అరెస్టులను ఖండించండి: సీపీఐ(ఎం)

నిర్బంధ అరెస్టులను ఖండించండి: సీపీఐ(ఎం)

- Advertisement -

అర్ధరాత్రి నుండి సీపీఐ(ఎం) ఇతర వామపక్ష నేతల గృహనిర్బంధం, అరెస్టులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే
పెండింగ్ రైల్వే లైన్ లకు కేంద్రం నుండి పైసా తేని ఎంపీ ధర్మపురి అరవింద్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్
: పసుపు బోర్డు ఆఫీసు ఓపెనింగ్ కోసం వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా నేతలతో పాటు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అర్ధరాత్రి నుండి ఇండ్ల మీద పడి అరెస్ట్ చేశారు. అనంతరం వివిధ పోలీస్ స్టేషన్లలో బంధించడం ప్రజాస్వామ్యాన్ని పౌర హక్కులను అవహేళన చేయడమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులకు అభిప్రాయపడ్డారు. అరెస్ట్ చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం ఆయన మాట్లాడుతూ.. అమిత్ షా పర్యటన ఉందని అర్ధరాత్రి నుండి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీనియర్ నాయకులు పెద్ది వెంకట రాములు, రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు ఏసాల గంగాధర్, నగర కమిటీ సభ్యులు రాములు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్ లతోపాటు ఇతర వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం ప్రభుత్వ పిరికిపంద చర్య. ఎలాంటి నిరసనలకు పిలుపు ఇవ్వకపోయినా పదుల సంఖ్యలో పోలీసులు అర్ధరాత్రి నాయకుల ఇండ్ల, పార్టీ కార్యాలయాల మీద దాడి చేశారు.

భయభ్రాంతులకు గురి చేయడం కనీస అవసరాలకు బయటకు రాకుండా గృహనిర్బంధం చేయడం మానవ హక్కులను ఉల్లంఘించడమే. అనేక వాగ్దానాలను జిల్లా ప్రజలకు చేసి బీజేపీ ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ వాటిని మర్చిపోయాడు. జిల్లా ప్రజల అసంతృప్తిని నిర్బంధలతో అనచటం సాధ్యం కాదు. గెలవగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తానని చెప్పిన మాట నేటికీ నెరవేరలేదు. ఆర్మూర్ నుంచి అదిలాబాద్ రైల్వే లైన్, నిజామాబాదు నుండి అదిలాబాదు డబ్బులు రైల్వే లైన్, బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్, నిజాంబాద్ నుండి హైదరాబాద్ వరకు డబల్ రైల్వే లైన్ ప్రతిపాదనలు తో పాటు భూసేకరణ జరిగిన నేటికీ దానికి సంబంధించిన నిధులను రాబట్ట లేకపోయారు.

ఆర్మూర్ నియోజకవర్గంలో లక్కంపల్లి సేజ్ కోసం 500 ఎకరాల భూమిని రైతుల నుండి సేకరించిన ప్రభుత్వం ఉపాధి కల్పన కోసం ఒక్క పరిశ్రమను తీసుకురాక పోవడం అరవింద్ చేతగానితనానికి నిదర్శనం. జక్రాన్ పల్లి దగ్గర నిర్మాణం కోసం భూములను సేకరించి సంవత్సరాలు గడుస్తున్న కేంద్రాన్ని ఒప్పించి అంతర్గత రాష్ట్రాల విమానాశ్రయాన్ని నిర్మాణం చేయడానికి నిధులు తీసుకరాకపోవడం చూస్తే ఈ జిల్లా అభివృద్ధికి బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్నే పెద్ద ఆటంకంగా ఉన్నారనేది అర్థమవుతుంది.

ఇప్పటికైనా ధర్మపురి అరవింద్ కేంద్రమంత్రి అమీషాకు చిత్తశుద్ధి ఉంటే ఈ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేష్, నాగన్న, జిల్లా నాయకులు నన్నేసాహెబ్, జంగం గంగాధర్, కొండ గంగాధర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -