Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్మృతుల కుటుంబాలకు చల్లా పరమార్శ 

మృతుల కుటుంబాలకు చల్లా పరమార్శ 

- Advertisement -

నవతెలంగాణ – పరకాల  : పరకాల మండలం నాగారం గ్రామంలో ఇటీవలే మృతిచెందిన బొమ్మరాజు రాజమ్మ కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొద్దిరోజులుగా  అనారోగ్యంతో భాదపడుతున్న మల్లక్కపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ అధ్యక్షులు బొజ్జం రవి తండ్రి సారయ్యని మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు.

పరకాల పట్టణానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపిటిసి, కౌన్సిలర్ చందుపట్ల తిరుపతి రెడ్డి తల్లి చందుపట్ల రాధమ్మ ప్రధమ వర్దంతిలో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad