నవతెలంగాణ – నెల్లికుదురు
మండల కేంద్రానికి చెందిన కోలా ముత్తమ్మ. మరియు జామ తండా కు చెందిన గుగులోతు సీతారామ నాయక్, లు మరణించడంతో ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం మృతుల పార్ధవ దేహానికి పూలమాలవేసి ఘనంగా నివాలలు అర్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. వీరు మరణించడం బాధాకరమని అన్నారు వీరు గ్రామంలో గ్రామ అభివృద్ధి కోసం వారి వంతు పాటు పడ్డారని అన్నారు. మృతిచెందిన కుటుంబానికి ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని తెలిపారు. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గడ్డం అరుణ్ కుమార్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు గుగులోతు నరేష్ మాజీ డైరెక్టర్ పులి శ్రీను మండల మండల కాంగ్రెస్ పార్టీ కార్మిక నేత ఆకుల నాగయ్య గుగులోతు వెంకన్న ప్రేణ్య తండా తదితరులు పాల్గొన్నారు.