- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని కల్లేపల్లి గ్రామానికి చెందిన మంకాళి అంతగిరి ఇటీవల ఆనారోగ్యంతో మృతి చెందాడు. సోమవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి మండల కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాయకులు చిలువేరు శ్రీనివాస్ రెడ్డి, కర్రావుల సందీప్,మచ్చ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



