- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు: మండలంలోని కోయ్యుర్ గ్రామానికి అబ్రహం పాస్టర్ భార్య సుశిరేక ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని బుధవారం కాంగ్రెస్ భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి అయిత రాజిరెడ్డి, జిల్లా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి లకావత్ సవేందర్ పరమర్షించి, ఓదార్చారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు చిత్రపటానికి నివాళులర్పించి, ఆర్థిక సాయం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బాపురెడ్డి, శంకర్, మహేందర్ రెడ్డి, కొండ సాగర్, పావిరాల లక్ష్మన్ పాల్గొన్నారు.
- Advertisement -