![]() |
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్..
నవతెలంగాణ – భువనగిరి : అహ్మదాబాద్ లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సంతాపం ప్రకటించింది. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ రూపానితో పాటు అనేక మంది భారతీయులు, బ్రిటిష్ పౌరులు, వైద్యులు, సిబ్బంది మృతి చెందడం బాధాకరమని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐ లు) రాష్ట్ర ఉపాధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు కుక్క దుగు సోమయ్య, జిల్లా అధ్యక్షులు బొల్లేపల్లి కుమార్, ఒక ప్రకటనలో తెలిపారు. మృతి చెందిన వారి బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలు వెంటనే తీసుకోవాలని ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.