Saturday, June 28, 2025
E-PAPER
Homeజాతీయంవిద్య కార్పొరేటీకరణను ఎదుర్కోండి

విద్య కార్పొరేటీకరణను ఎదుర్కోండి

- Advertisement -

ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో పాఠ్యాంశాలు:ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ మహాసభ ప్రారంభోపన్యాసంలో
ప్రముఖ జర్నలిస్ట్‌ శశికుమార్‌
జెండాను ఆవిష్కరించిన జాతీయ అధ్యక్షులు విపి సాను
కొజికోడ్‌ :
విద్యను కాషాయి కరించడంతో పాటు, కార్పొరేటీకరించడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం చేస్తున్న ప్రయత్నాలను ఎదుర్కోవాలని ప్రముఖ పాత్రికేయులు, ఏషియన్‌ స్కూల్‌ ఆఫ్‌ జర్నలిజం వ్యవస్థాపకులు శశికుమార్‌ పిలుపునిచ్చారు. కేరళలోని కొజికోడ్‌లో స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) 18వ జాతీయ మహాసభ శుక్రవారం ప్రారంభమయింది. ప్రతినిధుల సభను శశికుమార్‌, ప్రముఖ రంగ స్థల నటులు ఎంకె రైనా ప్రారంభించారు. ఈ సందర్భంగా శశికుమార్‌ మాట్లాడుతూ విద్యరంగంలోని కీలక వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందిన వ్యక్తులతో నింపివేయడంతో పాటు, పాఠ్యాంశాలను సైతం ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలంతో రూపొందిస్తున్నారని చెప్పారు. అదే సమయంలో అదాని, అంబానీలకు విద్యారంగాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయన్నారు. సంస్కృతి పరిరక్షణ పేరుతో యువత మెదళ్లను కలుషితం చేస్తున్నారని అన్నారు. ఈ ప్రయత్నాలను విద్యార్థిలోకం ఎదుర్కోవాలని, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులుగా ఆ ప్రతిఘటనలో ముందువరసలో నిలవాలని సూచించారు. భావజాల రంగంలో బిజెపి చేస్తున్న ప్రచారాన్ని అడ్డుకునేందకు సోషల్‌ మీడియాను ఆయుధంగా చేసుకోవాలని చెప్పారు. రంగస్థల నటులు ఎంకె రైనా మాట్లాడుతూ విద్యార్థులను అరెస్టు చేయడం, విశ్వవిద్యాలయాలపై దాడులు చేయడం ద్వారా భయానక వాతావరణం సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, బిజెపి దాడులకు దాన్ని ప్రతిదాడికి సాధనంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించారు. ”ప్రతి స్థాయిలో సంస్కృతిని ఉపయోగించండి. సంస్కృతి కేవలం వినోదంగా కాకుండా, కరుణ, దిశానిర్దేశం కోసం కూడా ఉండాలి. శుక్రవారం ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ జాతీయ అధ్యక్షులు విపి సాను జెండాను ఆవిష్కరించి మహాసభను ప్రారంభించారు. 122 మంది విద్యార్థి అమరవీరుల స్వస్థలాల నుంచి తీసుకొచ్చిన జెండాలను కూడా ఈ వేదిక వద్ద ఏర్పాటు చేశారు. ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూఖ్‌ బిశ్వాస్‌, జాతీయ ఉపాధ్యక్షులు నితీష్‌ నారాయణన్‌, సంయుక్త కార్యదర్శి దేబాంజన్‌ దేవ్‌, కేరళ పర్యాటక శాఖ మంత్రి, మహాసభ నిర్వాహక కమిటీ చైర్మన్‌ పిఎ మహమ్మద్‌ రియాస్‌, ఇతర నాయకులు హజరయ్యారు. కేరళ మంత్రి రియాస్‌ స్వాగతోపన్యాసం చేశారు, ప్రతినిధులకు స్వాగతం పలికారు. అమరవీరులకు సంతాప తీర్మానాన్ని నితీష్‌ నారాయణన్‌ ప్రవేశపెట్టారు. నివేదికను మయూఖ్‌ బిశ్వాస్‌ ప్రవేశపెట్టారు.
విద్యార్థుల మెదడు లో విష, భావ, తీవ్రమైన విద్వేషాన్ని నింపే చర్యలు వేగవంతం చేస్తుందని విమర్శించారు. ఇలాంటి చర్యలను ఎదుర్కొని, దేశ చరిత్ర ను కాపాడుకోడానికి ఈ మహాసభ వేదిక కావాలని పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌ దాడుల్లో ధ్వంసమైన పాలస్తినాకు సంఘీభావంగా ఈ మహాసభ వేదికకు పేరు పెట్టడం కన్నా.. గొప్ప విషయం ఏది లేదని, అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఎదురించే శక్తులు గా నేటి విద్యార్థుల్ని మలచాలని పిలుపునిచ్చారు. కొజికోడ్‌లోని పాలస్తినా సంఘీభావ నగర్‌లో ఈ నెల 30 వరకూ ఈ మహసభ జరగనుంది. ఈ మహాసభ లకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎస్‌ఎఫ్‌ఐ నాయకత్వం 68 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఆదివారం కొజికోడ్‌ బీచ్‌లో కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ పాల్గొనే బహిరంగ సభతో ఈ మహాసభ ముగియనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -