Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బంగారు పథకం సాధించిన విలువిద్య క్రీడాకారిణికి అభినందనలు: ఈగ సంజీవరెడ్డి

బంగారు పథకం సాధించిన విలువిద్య క్రీడాకారిణికి అభినందనలు: ఈగ సంజీవరెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్
కెనడాలో జరుగుతున్న అంతర్జాతీయ విలువిద్య పోటీల్లో భారతదేశానికి బంగారు పతకం సాధించి పెట్టడం పట్ల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు, జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు అయిన ఈగ సంజీవరెడ్డి, రాష్ట్ర అర్చరి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్లు చీకితను అభినందించారు. తెలంగాణలోని కరీంనగర్ కు చెందినటువంటి చికిత అండర్- 21 కాంపౌండ్ విభాగం లొ బంగారు పథకం సాధించడం పట్ల అభినందనలు తెలియజేస్తూ ఆమె మునుముందు భారతదేశ తరపున పాల్గొని మరిన్ని విజయాలు సాధించాలని, అలాగే కోచ్ క్రాంతి కుమార్ కు కూడా అభినందనలు తెలిపారు. చికితకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తరఫున మరియు తెలంగాణ అర్చరి అసోసియేషన్ నుండి అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని వారు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -