నవతెలంగాణ-హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక-2026 క్యాలెండర్లో రాష్ట్రంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన కొత్తగూడెం భద్రాచలం జిల్లా చర్ల విలేకరి దొడ్డి హరినాగవర్మకు సంస్థ యాజమాన్యం అభినందనలు తెలిపింది. నవతెలంగాణ రాష్ట్ర వర్క్షాప్ గురువారం హైదరాబాద్లో జరిగింది. దీనికి రాష్ట్ర కేంద్రం, అన్ని జిల్లాల సిబ్బంది, విలేకరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హరి నాగవర్మను అభినందించి, ఆయనకు మెమెంటో అందించారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ సీజీఎం పి ప్రభాకర్, ఎడిటర్ ఆర్ రమేశ్, బుకహేౌస్ ఎడిటర్ ఆనందాచారి, ఏడీవీటీ జీఎం వెంకటేశ్, జీఎం రఘు, హెచ్ఆర్ జీఎం నరేందర్రెడ్డి, మొఫిసిల్ రాష్ట్ర ఇన్చార్జి జి.వేణు మాధవరావు, ఖమ్మం రీజియన్ మేనేజర్ ఎండీ జావిద్, రీజియన్ డెస్క్ ఇన్చార్జి వీరేశం, భద్రాచలం డివిజన్ ఇన్చార్జి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ చర్ల విలేకరికి అభినందనలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



