- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి నివాసంలో పార్టీ కోర్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు తదితరులు పాల్గొన్నారు. గాంధీభవన్లో జరిగే పీఏసీ, అడ్వైజరీ కమిటీలో చర్చించాల్సిన అంశాలపై సమాలోచనలు చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, యూరియా కొరత, పార్టీ బలోపేతం తదితర అంశాలపై చర్చించే అవకాశముంది.
- Advertisement -