కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తండాల శ్రీను
నార్లాపూర్ లో మంత్రి సీతక్కకు పాలాభిషేకం
నవతెలంగాణ – తాడ్వాయి : నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా కార్యదర్శి తండాల శ్రీను, మండల ఉపాధ్యక్షులు ఇప్ప నాగేశ్వరరావు లు అన్నారు. సోమవారం నార్లాపూర్ లో ఇందిరమ్మ లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఇంటి నిర్మాణంలో పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు మొక్క శ్రీనివాస్, మండల యూత్ నాయకులు పెనుగంటి సాయి కృష్ణ, సంజీవరెడ్డి, కృష్ణా, సమ్మయ్య, నునావత్ శ్రీను, మాచర్ల రాజు, సంపత్, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు.
సొంతింటి కల నెరవేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES