నవతెలంగాణ – ఆత్మకూరు
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ విస్మరిస్తూనే.. తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో మైనార్టీలకు మంత్రి పదవి కేటాయించకుండా మొండి చేయి చూపించిందని తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మైనార్టీల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. మైనార్టీ మంత్రులు లేని కారణంగా గత కొన్ని నెలలుగా అనేక మైనార్టీ సమస్యలు పెండింగ్లో ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీ గురుకులాలు పక్కా భవనాలు లేక అద్దె భవనాల్లో అసౌకర్యాల మధ్య నడుస్తున్నాయన్నారు. మైనార్టీ విద్యార్థిని, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రభుత్వ మైనార్టీ ఉచిత డిగ్రీ కళాశాల లేక తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందన్నారు. మైనార్టీ స్టడీ సర్కిల్, అలాగే వక్ఫ్ భూముల సర్వే, వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు అంటి కీలక అంశాల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తెలంగాణ నూతన రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి వక్ బోర్డులో మైనార్టీ సంక్షేమ శాఖలో ఉద్యోగ నియమాకాలు జరగలేదని అన్నారు. రాష్ట్ర క్యాబినెట్లో ఓసీలు బీసీలు , ఎస్సీలు ఎస్టీల్లో నూ మంత్రివర్గం లోకి తీసుకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రికి మైనార్టీ నుండి ఒక్కరు కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మైనార్టీలను ఓటు బ్యాంకు కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం ఆలోచనల సరళిని మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనార్టీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్యాబినెట్లోకి మైనార్టీ మంత్రిని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.
మైనార్టీలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES