Friday, May 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచింది: బీఆర్ఎస్ నాయకులు

కాంగ్రెస్ రైతులను నట్టేట ముంచింది: బీఆర్ఎస్ నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులను నట్టేట ముంచిందని బుధవారం బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సలావత్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు అన్నారు. సమావేశంలో మాజీ ఎంపీపీ నా రెడ్డి దశరధి రెడ్డి మాట్లాడుతూ… మండలంలో 17 వేల ఎకరాల్లో వరి రైతులు సాగు చేస్తారని, రసాయన ఎరువు ల వాడకాన్ని తగ్గిస్తూ, రైతులు సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపుతుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సమయానికి,తగినన్ని పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను సరిపడా చేయక ఇబ్బంది పెడుతుందని అన్నారు. గతంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం సబ్సిడీపై రు 844 కు దాదాపు 1500 బ్యాగుల జిలుగు, 350 బ్యాగుల జనము విత్తనాలను సరపర చేసేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ముసలి కన్నీరు కాలుస్తూ 200 బ్యాగులు మాత్రమే సరఫరా చేసి, సబ్సిడీని ఎత్తివేసి రూ 2138లకు రైతులకు అందించడం దారుణమని మండిపడ్డారు. వేకువజామునే చెప్పుల లైను పెట్టి 500 మంది రైతులు లైన్లో ఉంటే, 200 మంది రైతులకు మాత్రమే పచ్చి రొట్ట విత్తనాలను అందించటం దారుణమని, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి మండలానికి అవసరపడే పచ్చిరొట్ట విత్తనాలను సరైన సమయానికి సరఫరా చేసి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఎక్కడికక్కడ ధర్నాలో ర్యాలీలు నిర్వహిస్తామని, అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడగల శ్రీనివాస్, మాజీ ప్రజా ప్రతినిధులు కొత్తొల గంగారం, గంగావత్ రాజు నాయక్, రాజేందర్, పోతునూరి ప్రసాద్, నాయకులు గడ్డం చిన్న రవీందర్ రెడ్డి, ల్యాగల మహిపాల్, పులి సుధాకర్, కడెం బైరు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -