నవతెలంగాణ – మిర్యాలగూడ
జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలుపు పట్ల మిర్యాలగూడ లో కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేశారు. స్థానిక గాంధీ భవన్ నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. బాణా సంచులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులే కాంగ్రెస్ గెలుపుకు దోహదపడిందని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిరుమర్రి కృష్ణయ్య పొదిల్ల శ్రీనివాస్ ముదిరెడ్డి నర్సిరెడ్డి, డిసిసి ఉపాధ్యక్షులు నాగు నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బసవయ్య గౌడ్ ,సలీం ఆరిఫ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అజార్, బెజ్జం సాయి, ఉబ్బ పెళ్లి కాశయ్య, రమేష్ నాయక్, బూడిద సైదులు, సిద్దు నాయక్ తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల సంబురాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



